నవతెలంగాణ – తంగళ్ళపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తంగళ్ళపల్లి మండలంలో ఘనంగా జరిగాయి. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఆర్డిఓ వెంకటేశ్వర్లు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రామ్మోహన్, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జయంత్ కుమార్ లు జాతీయ జెండాను ఎగరవేశారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గజబింక రాజన్న, బిజెపి కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీధర్ రావు, మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేశారు.
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES