– మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గోదావరి, బనకచర్ల ప్రాజెక్ట్తో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లనుందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గోదావరి బనకచర్లకు ఒక్క అనుమతి లేకుండానే ఏపీ పనులు చేపట్టిందని ఆరోపించారు. కేంద్రం తమ చెప్పు చేతల్లో ఉందని చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలదోపిడీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని అన్నారు. ఏ కొత్త ప్రాజెక్ట్ చేపట్టినా నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాల్సిన అవసరముందని గుర్తు చేశారు. ”తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వట్లేదనీ, నిటి ఆయోగ్ సమావేశం బహిష్కరిస్తామని సీఎం గతంలో చెప్పారు. కాని శనివారం జరిగిన నిటి ఆయోగ్ సమావేశంలో రేవంత్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజరులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. కేంద్రం బనక చర్ల ప్రాజెక్ట్ను అడ్డుకోకుంటే ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES