ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణాను 2030 వరకు ”ఏరో-ఇంజిన్” రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర ”రోడ్ మ్యాప్”ను సిద్ధం చేస్తున్నామన్నారు. ”టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్” , ”సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్” సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ”ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్” న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంగళవారం హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2023-24లో ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే 30,742 కోట్లకు పెరిగాయన్నారు. ”ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్” న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్త మవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యు ఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లోబ విరివిగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో సుకరన్ సింగ్, ఈడీ మసూద్ హుస్సేన్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక, తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



