సీఎస్ను కలిసిన ఇస్టా ప్రతినిధుల బృందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ 2047 నాటికి ప్రపంచ విత్తన కేంద్రంగా మారబోతున్నదని ఇస్టా ప్రతినిధుల బృందం నొక్కి చెప్పింది. గురువారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అంతర్జాతీయ విత్తన పరీక్షా సంస్థ (ఇస్టా) ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసింది. విత్తన నాణ్యత హామీ, విత్తనాలకు సంబంధించిన ఇతర సమస్యలపై చర్చించారు. ఇస్టా ఎగ్జిక్యూటివ్ సమావేశం హైదరాబాద్లో జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఇస్టా సెక్రెటరియేట్ స్టాఫ్ ఇండియా నేతృత్వంలోని కమిటీలో కేశవులు కుముసోత్, యూఎస్ఏ, ఇటలీ, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, పోలాండ్, అర్జెంటీనా, ఉరుగ్వే, స్విట్జర్లాండ్ దేశాల నుంచి కమిటీ సభ్యులున్నారు.
ఈ సంస్థ విత్తన ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. తెలంగాణను ప్రపంచ విత్తన ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఉంచడంతో పాటు భారతదేశ విత్తన రాజధానిగా దాని హోదాను బలోపేతం చేయడమే కాకుండా స్థిరమైన వ్యవసాయ వృద్ధికి కూడా ఇస్టా మద్దతిస్తున్నది. వ్యవసాయ, వాతావరణ, రవాణా ప్రయోజనాలు, బలమైన శాస్త్రీయ స్థావరం, నైపుణ్యం కలిగిన విత్తన పెంపకందారులు, విభిన్న విత్తన వ్యవస్థలు, విత్తన విధానాలను ఎనేబుల్ చేయడం వల్ల రాష్ట్రం పరిశోధన, ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారింది.
2047 నాటికి ప్రపంచ విత్తన కేంద్రంగా తెలంగాణ : ఇస్టా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



