– హైటెక్స్ వేదికగా రేపటి నుంచి శ్రీకారం
– గవర్నర్తోపాటు సీఎం, మంత్రుల హాజరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ వేదికగా ”తెలంగాణ- నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్: ఏ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్” పేరిట సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హైటెక్స్లో నవంబర్ 20 నుంచి 22 వరకు, రాజ్భవన్ లో నవంబర్ 25 నుంచి 27 వరకు రెండు విడతలుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయం, ఈశాన్య ప్రాంత అభివద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నది.
ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్ లో ‘సంస్కృతుల సంగమం – సమద్ధికి సోపానం’ అనే అంశంతో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డితో పాటు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు, ఇతర మంత్రులు, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హాజరుకానున్నారు.
మొదటి దశ – సాంస్కృతిక విభాగాలు (నవంబర్ 20-22, హైటెక్స్)
కళా ప్రదర్శనలు: లలిత కళలు , ప్రదర్శన కళలు ప్రదర్శన
విజ్ఞాన మార్పిడి: సాహిత్యంపై చర్చలు, ఫిల్మ్ ఫెస్టివల్
సామాజిక అంశాలు: మహిళా సాధికారతపై ప్రత్యేక దష్టి, స్వయం సహాయక బందాల ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు.
యువతకు ప్రాధాన్యత: క్రీడా సంబంధిత కార్యక్రమాలు.
రెండవ దశ – నైపుణ్యం అభివద్ధి (నవంబర్ 25-27, రాజ్ భవన్,ఫీల్డ్ విజిట్స్)
ప్రధాన రంగాలు: వైద్యం, ఆరోగ్య శాస్త్రాలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ ,ఐటీఈఎస్ పై ప్యానెల్ చర్చలు జరుగుతాయి.
క్షేత్ర సందర్శనలు: హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రులు, జీనోమ్ వ్యాలీ, టి-హబ్ను సందర్శిస్తారు.
ముగింపు వేడుక: నవంబర్ 27న రాజ్ భవన్లో ముగింపు వేడుకతో ఉత్సవం ముగుస్తుంది.ఈ ఉత్సవం తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల మధ్య అభివద్ధి భాగస్వామ్యానికి కొత్త ఒరవడిని సష్టిస్తుందని ఆశిస్తున్నారు.
నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్కు తెలంగాణ ఆతిథ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



