Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి

- Advertisement -

– మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మెన్‌, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్‌
– వనపర్తిలో సురవరం 129వ జయంతి కార్యక్రమం
నవతెలంగాణ-వనపర్తి

తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి, గోల్కొండ కవుల సంచిక ముద్రించి తెలంగాణ కవుల ఆత్మ గౌరవాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన యోధుడు, వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మెన్‌, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో బుధవారం మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో బహుభాషా కోవిదుడు, గోల్కొండ కవుల సంచిక వ్యూహకర్త సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారాం ప్రకాష్‌ మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి రచయిత, కవి పరిశోధకుడు, అనువాదకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది, అనువాదకుడు అని వివరించారు.
తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నిజాం నిరంకుశ పాలనపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. తన వాగ్ధాటితో, తన రచనల ద్వారా ప్రజల కోసం ఎంతో సేవ చేశారన్నారు. పురాణాలు, చరిత్ర, సాంఘిక చైతన్యాన్ని, సాహిత్య సౌరభాన్ని ఈ ప్రపంచానికి చాటిచెప్పిన సాహితీమూర్తి అని చెప్పారు. తెలంగాణలో పండితులు, పద్య కవులు లేరన్న ఆంధ్రుల మాటను సవాల్‌గా స్వీకరించి తెలంగాణలో 354 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. గోల్కొండ పత్రికను, భారత సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించిన గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కవి బూరోజు గిరి రాజాచారి, కవి, వ్యాఖ్యాత డాక్టర్‌ నాయకంటి నరసింహ శర్మ, వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు గంధం నాగరాజు, సాహితీవేత్త కంటే నిరంజనయ్య, బోయ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర నాయకులు కావలి బాలస్వామి నాయుడు, నాయకులు చింతకుంట కురుమయ్య, మీదిండ్ల కృష్ణయ్య, టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు వెంకటేష్‌, ఎంఈఎఫ్‌ నాయకులు రాంబాబు, చంద్రశేఖర్‌, మాజీ జడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు బిచ్పల్లి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు పరమేశ్వర చారి, నాయకులు డి.సత్యంచారి, రమేష్‌చారి, రెడ్డి సేవా సంఘం నాయకులు కృపాకర్‌రెడ్డి, రామిరెడ్డి, మాణిక్యరెడ్డి, తిమ్మారెడ్డి, వెలమ సంఘం నాయకులు మధుసూదన్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -