– పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను తీసుకురాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కేంద్రం నుంచి అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని పార్టీ నేతలకు సూచించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలీ ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు. కులగణన చేసి మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ సవాల్ విసిరిందని చెప్పారు. కేంద్రం కూడా జనగణనతోపాటు కులగణన చేసే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలంగా పని చేయాలని సూచించారు. త్వరలో మార్కెట్, దేవాలయ కమిటీల్లో నామినేషన్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.
మహేశ్కుమార్గౌడ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ రాసిన వ్యాసాల సంకలన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ అనే పుస్తకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, జే.గీతారెడ్డి ఆవిష్కరించారు. తాను రాసిన వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకురావడం పట్ల మహహేశ్కుమార్గౌడ్ను వారు అభినందించారు.
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES