– బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు
– అన్యాయం చేస్తే ఉపేక్షించం : మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తున్నదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్లపై తెలంగాణకు అన్యాయం చేస్తే ఉపేక్షిం చబోమని హెచ్చరించారు. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. అంతరాష్ట్ర జలవిధానాలు, జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అభిప్రాయడ్డారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్కు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖలు రాసినట్టు చెప్పారు. ‘ ఏపీ నుంచి ఎలాం టి ప్రతిపాదనలు రాలేదనీ, వస్తే అన్ని నిబంధనలు పరిశీలిస్తామని చెప్పారు. చట్ట ప్రకారం ముందుకె ళ్తామని హామీ’ ఇచ్చారు. ఏపీ ఉల్లంఘనలను లేఖలో వివరించామనీ, చట్టవిరుద్ధంగా ఏపీకి కేంద్రం సహకరిస్తుందని అనుకోవట్లేదు.. తెలంగాణకు అన్యాయం జరిగితే.. ఎంతవరకైనా పోరాడుతాం, తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామనీ, వెనక్కి తగ్గేదేలేదని వివరించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజరు కేంద్రాన్ని ఒప్పించాలి. కృష్ణాలో అన్యాయం జరుగుతుంటే పదేండ్లు బీఆర్ఎస్ సహకరించింది. ఉమ్మడి కృష్ణా నీటిలో తెలంగాణ వాటా 724 టీఎంసీలు, ఏపీ బీఆర్ఎస్ హయాంలో ఏపీకి 1254 టీఎంసీలు తరలించారని గుర్తు చేశారు. కాళేశ్వరానికి వృధా ఖర్చు చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యేవన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద కట్టడంతో రూ.68వేల కోట్లు కాళేశ్వరానికి అదనపు ఖర్చు అయిందని చెప్పారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేదా ? కృష్ణా నీళ్ల విషయంలో అప్పుడు మోసం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని ఉత్తమ్ విమర్శించారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ సర్కారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనమని వ్యాఖ్యానిం చారు. ప్రతిరోజూ మూడు టీఎంసీ లను తరలించుకుపోతుంటే కేసీఆర్ సర్కారు తోడ్పడిందని చెప్పారు. జగన్తో అలరుబలరు చేసుకుని, కృష్ణానీటి దోపిడికీ కేసీఆర్ సహకరించారని వివరించారు. ఏపీ దోచుకునేందుకు కేసీఆర్ సహకరించార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో కేసీఆర్, హరీశ్రావు ఏపీ కోసమే పనిచేశారని వివరించారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యేవరకు తెలంగాణ కావాలనే ఆపెక్స్ కౌన్సిల్కు వెళ్లలేదని గుర్తు చేశారు. జగన్-కేసీఆర్ రహస్య ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అపెక్స్ కౌన్సిల్కు వెళ్లలేదని విమర్శించారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చిఅబద్ధాలు చెబుతున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ రావు అని పేరు మార్చుకుంటే సరిపోతుందన్నారు. గోబెల్స్ బతికి ఉంటే, వీళ్లను చూసి నన్ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయేవారన్నారు.
తెలంగాణ నీటిహక్కుల కోసం రాజీలేనిపోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES