Friday, April 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండలు..

తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శుక్రవారం భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండNLG, KMM, NZB జిల్లాల్లో 40.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ADB, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో 39.6 డిగ్రీలు, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీలు నమోదయ్యాయి. HYDలో 37.3 డిగ్రీలు నమోదైంది. శనివారం ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ఆదివారం నుంచి మూడు3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -