- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ గోవిందసాయి దివ్య యోగాశ్రమము, శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 33వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గోవింద గిరి కళ్యాణ మండపంలో ఈనెల 4న నిర్వహించే శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలకు హాజరవ్వాలని ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో ఆలయ కమిటీ క్రియాశీల కార్యవర్గ సభ్యులు అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, రాజారపు బాల్ రాజ్, కూశన్నగారి నర్సయ్య, గడ్డం మల్లేష్, తదితరులు ఉన్నారు.
- Advertisement -



