- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జడ్పీ బాలికల, బాలుర పాఠశాలలతో పాటు లిటిల్ హన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే చేరుకున్నారు. నోటీసు బోర్డులపై తమ గదుల నంబర్లను చూసుకుని లోపలికి వెళ్లారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొత్తం మూడు కేంద్రాల్లో ఒకరు ఆబ్సెంట్ అయ్యారని ఎంఈఓ విజయ్ కుమార్ తెలిపారు.
- Advertisement -



