– పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓపెన్ స్టడీ సెంటర్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ దూరవిద్య ప్రవేశాలు ప్రారంభం అయ్యాయని, దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బడి మధ్యలో మానివేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుకోవాలని అనుకునే వారికి 2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ షెడ్యూలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఓపెన్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ లో ఈనెల 12 నుండి జూలై చివరి వరకు అడ్మిషన్ చేసుకోవచ్చని తెలిపారు.ఈ అవకాశాన్ని బడి మధ్యలో మానేసిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు సాయన్న కోరారు.
ఓపెన్ పదవ తరగతి దరఖాస్తు కొరకు కొరకు :
1).పాత పాఠశాలకు సంబంధించి టీసీ గాని, బోనఫైడ్ సర్టిఫికెట్ కానీ, తహసిల్దార్ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్, 2).ఆధార్ కార్డ్, 3).కులం ధ్రువీకరణ పత్రం, 4).రెండు ఫోటోలు పైవన్నీ రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఓపెన్ ఇంటర్మీడియట్ దరఖాస్తు కొరకు:
1).టెన్త్ మెమో, 2).టీసీ, 3).కుల ధ్రువీకరణ పత్రం, 4).ఆధార్ కార్డ్, 5).రెండు ఫోటోలు, పైవన్నీ రెండు సెట్ల జిరాక్స్ కాఫీలతో దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశాలకు సంబంధించిన సందేహాలకు, పూర్తి వివరాల కొరకు 8790465456, 9515167500 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.