- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గాలివాన బీభత్సానికి కాళేశ్వరంలో సరస్వతి పుష్కర వీఐపీ ఘాట్ వద్ద చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు కిందపడ్డాయి. రహదారులపై ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు చెల్లా చెదురయ్యాయి. వీటిని చక్కదిద్దేందుకు సింగరేణి రిస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది . దెబ్బతిన్న లైటింగ్ తదితర సదుపాయాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.
- Advertisement -