నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాల ముందు ( టి.జి.వి.పి ) తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేవనీ, అనుమతులు లేనటువంటి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి ఆ పాఠశాలకు తమ పిల్లలను పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అడ్మిషన్స్ అనేవి చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ తో మాట్లాడితే మాకు ఇంకా ఎటువంటి పర్మిషన్స్ రాలేదు మీకు చేతనైన చేసుకోండి అంటూ దురుసుగా మాట్లాడడం జరుగుతుందన్నారు. ఎంఈఓ కు ఫోన్ చేస్తే ఎంఈఓ ఫోన్ కట్ చేయడం జరిగిందన్నారు. డీఈఓ కి కాల్ చేస్తే ఎటువంటి పర్మిషన్ లేదు ఇప్పటికి నారాయణ స్కూల్ వాళ్ళు ప్రపోజల్ కూడా పెట్టలేదు అని డీఈవో చెప్పడం జరిగిందన్నారు. దీనిపై వెంటనే ఎంఈఓ, డీఈవో వెంటనే నారాయణ పాఠశాల పైన చర్యలు తీసుకోనీ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. లేనియెడల కామారెడ్డి ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడించే వరకు ఊరుకోమని పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకులు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్, రాజేందర్, తేజ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించి నిర్వహించిన టిజివిపి నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES