Monday, June 2, 2025
E-PAPER
Homeసినిమాఅద్భుతమైన రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌

అద్భుతమైన రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భైరవం’. విజరు కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. పెన్‌ స్టూడియోస్‌ డాక్టర్‌ జయంతీలాల్‌ గడా సమర్పించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘మా అందరికీ కొంచెం గ్యాప్‌ వచ్చినా ఆడియన్స్‌ నుంచి ఇంత సపోర్టు, ప్రేమ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా మీరందరూ థియేటర్స్‌లో చూసి ఎంజారు చేయాలి. ఇలాంటి మంచి సినిమా చూస్తే మీకు కూడా ఒక మంచి ఫీలింగ్‌ ఉంటుంది. ఆ రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇలాంటి సినిమా మీరందరూ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని, నన్ను సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌’ అని చెప్పారు. ‘మా సినిమాకి గొప్ప విజయం ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ఈ సినిమా మాకు ఇచ్చిన డైరెక్టర్‌ విజయకి జీవితాంతం రుణపడి ఉంటాం. సినిమాని అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు. సాయి శ్రీనివాస్‌ గ్రేట్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. రోహిత్‌ కంగ్రాజులేషన్స్‌. 9 సంవత్సరాలు తర్వాత వచ్చిన నాకు ఇంత ప్రేమ, ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. రేపటి నుంచి ప్రతి ఒక్క ఊరికి వస్తాం. ఇది విజిల్స్‌ వేసి గోల చేసే సినిమా ఇది’ అని హీరో మంచు మనోజ్‌ అన్నారు.
హీరో నారా రోహిత్‌ మాట్లాడుతూ, ‘సినిమాకి చాలా మంచి పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ కావాలి. ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా వెళ్లి చూడండి. నా కెరీర్‌లో ఇలాంటి క్యారెక్టర్‌ ఎప్పుడు చేయలేదు. ఆ క్యారెక్టర్‌కి ఇంత గొప్ప రెస్పాన్స్‌ రావడం చాలా ఆనందాన్నిచ్చింది’ అని తెలిపారు.
‘తెలుగు చిత్ర పరిశ్రమలోకి నాకు ఇంత చక్కని స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు. సినిమాని అద్భుతంగా సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. మీ సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్‌ అతిధి శంకర్‌ చెప్పారు. డైరెక్టర్‌ విజరు మాట్లాడుతూ,’నా గత రెండు సినిమాలు కంటే ఈ సినిమాతో నాకు హ్యూజ్‌ సక్సెస్‌ ఇచ్చారు. అందరూ హీరో ఫ్యాన్స్‌ సినిమాని సపోర్ట్‌ చేశారు. వారి సపోర్టు ఎప్పుడు మర్చిపోలేనిది. ఇక్కడే కాదు ఓవర్సీస్‌లో కూడా చాలా అద్భుతమైన టాక్‌ వచ్చింది. ఈ సినిమా మరింత అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘సినిమాకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ముగ్గురు హీరోలు చాలా అద్భుతంగా నటించారు. మా కష్టానికి తగిన ఫలితం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని నిర్మాత రాధా మోహన్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -