ప్రజాభవన్కు బహిరంగంగా వెళ్తే రహస్యం ఎలా అవుతుంది? : మంత్రుల భేటీపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వివరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ రహస్య భేటీ అంటూ విష ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంత్రుల భేటీపై సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు కావాలని పని గట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో మంత్రివర్గం అనేది ఒక యూనిట్. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం ఏర్పడకుండా ఉండేందుకు సీనియర్ మంత్రులుగా తమలోతాము చర్చించుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. లోక్ భవన్లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే తామంతా ఒకే కారులో వెళ్లామనీ, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత అనీ, దానికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదని హితవు పలికారు. ఇలాంటి వ్యక్తిత్వ హననంతో కూడిన ఊహాజనిత కథనాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
అది విషప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



