Monday, June 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం95 శాతం మార్కుల నిబంధనను వెనక్కి తీసుకోవాలి

95 శాతం మార్కుల నిబంధనను వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

– టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి అనాలోచిత నిర్ణయం : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 95 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులకు మాత్రమే జెఈఈ, నీట్‌ కోచింగ్‌ అందించాలనే టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక గురుకులాల్లో జేఈఈ, నీట్‌ కోచింగ్‌ ద్వారా పేద విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రధానంగా గౌలిదొడ్డి, చిలుకూరులాంటి చోట్ల ప్రతిష్టాత్మక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) గురుకులాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వాటిలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఖచ్చితంగా 95 శాతం మార్కులుంటేనే ఇందులో కొనసాగాలని ఆదేశాలిచ్చారని తెలిపారు. లేకపోతే వారు సాధారణ గురుకులాలకు వెళ్లాలంటూ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి అలుగు వర్షిణి ఇచ్చిన ఆదేశాలు అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి-2025 లో 95 శాతం, అంత కంటే ఎక్కువ మార్కులొచ్చిన విద్యార్థులకు మాత్రమే జేఈఈ, నీట్‌ కోచింగ్‌ అందించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే అవకాశముందని విమర్శించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ నోటిఫికేషన్‌లో ఇలాంటి నిబంధనలు ఏమీ లేవని తెలిపారు. మధ్యలో కూడా ఎలాంటి సర్య్కులర్‌ కూడా ఇవ్వకుండా ఇప్పుడు 95 శాతం మార్కులు రాని విద్యార్థులను ఈ విద్యాసంస్థల్లో చదువుకోవటానికి వీల్లేదనీ, వేరే కళాశాలల్లోకి వెళ్లమని చెప్పటం సరైంది కాదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -