Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా ప్రభుత్వంతో నెరవేరుతున్న పేదల సొంతింటి కళ 

ప్రజా ప్రభుత్వంతో నెరవేరుతున్న పేదల సొంతింటి కళ 

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున పరకాల పట్టణంలోని తొమ్మిదవ వార్డులో లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీనివాస్ ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర అలయకమిటి చేర్మెన్ కొలుగురి రాజేశ్వర్ రావు సమన్వయకమిటి సభ్యులు చందుపట్ల రాఘవ రెడ్డి,9 వ వార్డ్ ఇంచార్జ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు దార్న వేణుగోపాల్, సిలువేరు చిరంజీవి, వెలదండి సురేష్, 9 వార్డ్ అఫిసర్ బాషబోయిన మొగిలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -