- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పరిచయం లేని ఓ వ్యక్తి ఇంట్లోకి ఒక దుండగుడు చొరబడి 5 ఏళ్ల చిన్నారి తల నరికి దారుణంగా చంపేశాడు. చిన్నారి తల్లి కేకలు విని గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని చితక్కొట్టారు. ఈ దాడిలో నిందితుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -