ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
అంగన్వాడీలో చిన్నారులకు ఎగ్ బిర్యానీ పంపిణీ ప్రారంభం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : అంగన్వాడి కేంద్రాల్లో ప్రీస్కూల్ విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడి చిన్నారులకు ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో ప్రీస్కూల్ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్న ముఖ్య ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ఎగ్ బిర్యాని పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందే అన్ని సేవలను, సదుపాయాలను చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తల్లులు తమ పిల్లల్ని తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకే పంపించాలన్నారు.అంగన్వాడికి వచ్చే చిన్నారులకు అవసరమైన అన్ని రకాల పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందుతుందన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్నారులకు ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు గంగాహంస, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, అంగన్వాడీ టీచర్లు యమున, బాలమణి లక్ష్మి, గంగాజమున, దివ్య, రజిత, వరలక్ష్మి, ఆయాలు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రీస్కూల్ విద్యార్థుల హాజరు శాతం పెంచాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES