నవతెలంగాణ – గంభీరావుపేట: ముచ్చర్ల గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులతో రూ.1 లక్ష మంజూరవ్వడంతో నూతనంగా హైమస్ లైట్లను ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులు మంగళవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా హామీద్ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డిని హైమస్ లైట్లు కోరడంతో నిధులు మంజూరు చేసి ప్రారంభించడంతో గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొమిరి శెట్టి తిరుపతి,బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, ముచ్చర్ల గ్రామ శాఖ అధ్యక్షులు వంగ రాఘవేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు గంగి స్వామి,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అవునూరి లక్ష్మయ్య,గుమ్ముల రాజం,యాడరపు పోచయ్య, నక్క రాజయ్య,మెతుకు నర్సింలు,గాడిచర్ల శ్రీనివాస్,అవునూరి అంజయ్య, దాసరి శ్రీనివాస్, ప్రశాంత్ పాటు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.