Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన

- Advertisement -

– మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ బోధన అందుతుందని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో  విద్యార్థులకు ఎంఈఓ ఆంధ్రయ్య, స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి చేతులమీదుగా ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఆంధ్రయ్య  మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య బోధన అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు నాణ్యమైన ఉచిత మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు అందించడంతోపాటు ఎన్నో సౌకర్యాలను, వసతులను విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సున్నం శ్రీనివాస్, ఉపాధ్యాయులు గుజ్జేటి రవీందర్, ఉపాధ్యాయురాలు సుజాత, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడు సున్నం మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -