పారిస్ డైమండ్ లీగ్లో పసిడి
పారిస్ (ఫ్రాన్స్) : భారత అథ్లెటిక్స్ సూపర్స్టార్, ఒలింపిక్స్లో రెండు సార్లు పతకాలు సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ ఏడాది అదిరే విజయం అందుకున్నాడు. దోహా డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా ఎన్నాండ్లో ఎదురుచూసిన 90 మీటర్ల (90.23 మీటర్లు) దూరం అందుకున్నప్పటికీ.. అక్కడ ద్వితీయ స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. పారిస్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా అగ్రస్థానం సాధించి సత్తా చాటాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 88.16 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా పసిడి పతకం లాంఛనం చేసుకున్నాడు. దోహాలో ఆఖర్లో అద్భుతం చేసిన అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) పారిస్లో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. జులియన్ వెబర్ 87.88 మీటర్లతో సిల్వర్ మెడల్ అందుకోగా.. లూయిజ్ డ సిల్వ 86.62 మీటర్లతో కాంస్య పతకం దక్కించుకున్నాడు.
మెరిసిన నీరజ్ చోప్రా
- Advertisement -
- Advertisement -