Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుంది కేంద్ర ప్రభుత్వ తీరు

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుంది కేంద్ర ప్రభుత్వ తీరు

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
నవతెలంగాణ –  కామారెడ్డి 

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 26, 27 తేదీలలో వచ్చిన భారీ వరదల వల్ల జాతీయ రహదారులతో సహా మార్గాలన్నీ ధ్వంసం అయ్యాయని వంతెనలు, చెక్ డ్యాములు కొట్టుకుపోయి పల్లెలు, పట్టణాలు అంటూ తేడా లేకుండా జలదిగ్బంధంలో చిక్కుకుపోయి రైతుల కష్టార్జిత మంత వర్షార్పణమై నీటిలో కొట్టుకుపోయిందన్నారు. రెండవ వైపు జలదిగ్బంధంలో వరద ఉధృతిలో చిక్కుకున్న గ్రామాలు పట్టణాల్లోని నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రోజుల తరబడి విద్యుత్ లేక, నీళ్లు లేక తిండి లేక నానా అవస్థలు పడ్డారని అన్నారు.

ప్రధానంగా జిల్లా కేంద్రంలోని జి ఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బతుకమ్మ కుంట, టీచర్స్ కాలనీ, గాంధీనగర్ లాంటి నివాస ప్రాంతాలు వరద నీటితో నిండిపోయి ఇండ్లలో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులతో సహా అన్ని రకాల వస్తువులన్నీ చెడిపోయి పిల్లల బుక్స్ పనికిరాకుండా పోయి ఒక్కొక్క కుటుంబానికి 10 నుండి 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి  స్పందించిన తీరు బాగున్న బాధితులకు నష్ట పరిహారం అందించడంలో విఫలమైందని అన్నారు.   ఇక కేంద్ర బిజెపి ప్రభుత్వం స్పందించిన తీరు కామారెడ్డి ప్రజలను అవమానపరిచేదిగా ఉందని అన్నారు.

ఇప్పటికైనా సందర్శనకు వచ్చిన కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని,  పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40,000 చొప్పున వరదతో ఇంటి సామాన్ నష్టపోయిన ప్రజలకు కుటుంబానికి మినిమం రూ.10 లక్షల చొప్పున అందరికీ తగిన నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరామ్ నాయక్, కొత్త నరసింహులు, ముధం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -