సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్కుమార్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా బాంబు దాడి, ఇజ్రాయిల్-అమెరికా సంకీర్ణ యుద్ధానికి వ్యతిరేకంగా బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్లో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు చేబూని యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాల హోరెత్తించారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ మాట్లాడుతూ యుద్ధానికి వ్యతిరేకంగా తన వైఖరి మార్చుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అమానవీయ ఘటనకు వ్యతిరేకంగా గళం విప్పలేని మోడీ, అమిత్ షాలకు 50 ఏండ్ల క్రితం దేశంలో జరిగిన అమానవీయత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మానవత్వం గురించి మాట్లాడే ముందు పాలస్తీనా, ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉండాలని హితవు పలికారు.
అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు
ఆందోళన చేపడుతున్న నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారంతా రోడ్డుపైనే బైటాయించి ఆందోళనకు కొనసాగించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు మెమునా మొల్లా, ఆశాశర్మ, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీిఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, సీజీపీఐ పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను కేంద్రం వ్యతిరేకించాలి
- Advertisement -
- Advertisement -