Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్టీ కొట్టిన కారు మానవత్వం చాటుకున్న చైర్మన్

పల్టీ కొట్టిన కారు మానవత్వం చాటుకున్న చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారులో ఉన్నవారికి తీవ్ర గాయాలయవగా హైదరాబాద్ నుండి భిక్కనూరు వస్తున్నా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదాన్ని గమనించి గాయాలైన వారిని తన సొంత వాహనంలో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని మానవత్వంతో తన కారులో ఆసుపత్రికి తరలించడం పట్ల పలువురు అభినందించారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -