- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : నిరుపేదలకు ఇండ్లు కట్టించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్దులు అన్నారు. ఆదివారం, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట (అహ్మద్ నగర్) గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు నీలం నర్సింగరావు నిర్మాణానికి ముగ్గు పోయడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ శంకర్, మొగిలిపాక నరసింహులు, పరుశరాములు, నీలం విక్రమ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -