నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకుడు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 4న థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నటి లయ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
దర్శకుడు శ్రీరామ్ వేణు చెప్పిన కథ విన్నాక ఇది నా రీ- ఎంట్రీకి సరైన సినిమా అనిపించింది. ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్లో నటించాను. తనొక ఆఫీసర్. స్ట్రిక్ట్గా ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది.
ఈ క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడదు. కానీ మాట్లాడినప్పుడు చాలా పవర్ఫుల్గా చెబుతుంది. చాలా స్ట్రాంగ్ ఉమెన్. తను అనుకున్నది చేస్తుంది. ఏది ఏమైనా భయపడదు. ఈ క్యారెక్టర్లో స్ట్రిక్ట్నెస్తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి. నా కెరీర్లో ఇప్పటివరకూ ఒక సాధారణ అమ్మాయి పాత్రల్లోనే నటించాను. ఈ మూవీలో మాత్రం స్ట్రాంగ్ ఉమెన్గా నటించే అవకాశం దక్కటం ఆనందంగా ఉంది.
ఇందులో హీరో నితిన్కి అక్కయ్యగా నటించా. నితిన్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇందులో తను చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తాడు. ‘తమ్ముడు’ అనే టైటిల్ ఈ సినిమాకు యాప్ట్. ఇది కరెక్ట్ అని మీరు కూడా సినిమా చూశాక చెబుతారు. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’కి ఈ చిత్రానికి పోలిక లేదు. అలాగే అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఓ మంచి సినిమాలో నటించినందుకు హ్యాపీగా ఉంది. మళ్ళీ సినిమాల్లో నటించాలనే అమెరికాలో చేస్తున్న ఉద్యోగం మానేశా. డిఫరెంట్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తాను.న
రీ- ఎంట్రీకి సరైన సినిమా
- Advertisement -
- Advertisement -