నవతెలంగాణ – పెద్దకోడప్ గల్ : మండల కేంద్రంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలతో పాటు ప్రయివేట్ పాఠశాలలను సోమవారం మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఉదయం ప్రార్థన చేసే సమయంలో ఒక్క ఉపాద్యాయురాలు ఉండగా ఇంకో ఉపాద్యాయురాలు ఆలస్యంగా రావటంతో విద్యాధికారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి ఒక్క పాటశాల లో ఉపాద్యాయులు సమయ పాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు పేద కుటుంబాల నుండి చదువుకోవడానికి వస్తారని ప్రతి ఒక్క విద్యార్థి పై ప్రత్యేక నిఘా పెట్టి చదువులో రాణించే విదంగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.ప్రయివేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని అన్నారు.
పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యధికారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES