Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండు జిల్లాల చీరకాల స్వప్నం నెరవేరబోతోంది.!

రెండు జిల్లాల చీరకాల స్వప్నం నెరవేరబోతోంది.!

- Advertisement -

కిషన్ రావు పల్లి నుంచి భూపాలపల్లి రోడ్డుకు భూమిపూజ నిర్వహించిన మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు 
నవతెలంగాణ – మల్హర్ రావు
: పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లి కిషన్ రావు పల్లి, భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల, పెద్దతూoడ్ల మీదుగా జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్డుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు జిల్లా కలెక్టర్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు ప్రారంభించారు. దీంతో రెండు జిల్లాల చిరకాల కోరిక తిరబోతోందని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. భూపాలపల్లి నుండి తూండ్ల వరకు రూ.4 కోట్ల 70 లక్షలతో నిర్మించనున్న రహదారి  నిర్మాణం వల్ల ప్రజలకు దూర భారం తగ్గుతుందన్నారు. అలాగే కిషన్ రావు పల్లి నుండి భూపాలపల్లి వన్ ఇంక్లైన్ వరకు 4.70 కోట్లు పారెస్ట్ శాఖకు చెల్లించడం జరిగిందన్నారు.

మండల కేంద్రమైన తాడిచర్లలో రూ.16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన చిల్డర్న్స్ పార్కును ప్రారంభించారు. రహదారి నిర్మాణం వల్ల తాడిచర్ల, మల్లారం, తాండ్ల గ్రామాలతో పాటు మంథని నుండి జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి 23 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు. రహదారి నిర్మాణానికి అటవీ అనుమతులు రావడం చాలా కష్టంతో కూడుకున్నప్పటికి ప్రభుత్వ చొరవ,  విశేష కృషి చేసి రహదారి నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరు చేపించినట్లు తెలిపారు. ఈ రహదారిని నిర్మాణం వల్ల మండల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి దూరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి చాలా దూరం తగ్గుతుందని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. 

నిర్ణీత  సమయంలోగా రహదారి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తాడిచర్ల ఓసిపి బ్లాక్-1 డేంజర్ జోన్ కు సంబంధించి భూసేకరణ చేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రకటించారని, ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్కు  నిర్మాణం వల్ల చిన్నారులు ఆడుకోవటానికి, అలాగే వ్యాయామానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. అన్ని మండల కేంద్రాల్లో పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  అంగన్వాడీ,  గ్రామపంచాయతీ భవనాల  నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు నిరంతరం ఉపయోగపడే పనులు చేపడుతున్నదని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేర అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు,డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, మాజీ ఎంపిపిలు చింతలపల్లి మలహల్ రావు, ఐస్నపు రవి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సవేందర్, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,రాహుల్,వెంకటస్వామి యాదవ్,రాజు నాయక్,మావురపు వెంకన్న,జగన్ నాయక్,జంపయ్య, జియా అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -