Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పిచాలి

ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పిచాలి

- Advertisement -
  • – రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలి..
  • – పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పరిరక్షణకై ఐక్యంగా పోరాడి కాపాడుకుందాం..
  • – తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ…
    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

      జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజు కూలీ 600 రూపాయలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్రలను చేస్తున్నదని ఈ కుట్రలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడి చట్టాన్ని పరిరక్షించుకుందామని వారు పిలుపునిచ్చారు

    శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, చట్టపరి రక్షణ కోసం వందలాది మంది కార్మికులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం జిల్లా పరిపాలన అధికారి జగన్ కి వినతిపత్రం అందజేసి, ధర్నాలో మాట్లాడారు. 

 దేశంలో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో 2.50 లక్షల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే 86 వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు. నిధులు తగ్గించడం, పని దినాలు తగ్గించడం, జాబ్ కార్డులు ఇవ్వకపోవడం, కూలీ రేటు పెంచకపోవడం, చట్టంలో ఉన్న వాటిని అమలు చేయకుండా మౌలిక వసతులను తగ్గించడం మోడీ ప్రభుత్వం నిత్యము కొనసాగిస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఉపాధి హామీ పనులకు పోతే డబ్బులు రావని భయాన్ని కార్మికులలో సృష్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. మున్సిపల్ పట్టణాల్లో, నగర పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించి పేదలకు, వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలని, జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని, ఉపాధి హామీలో పనిచేస్తున్న బార్యాభర్తలకు గడ్డపార, తట్ట, పారా, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లు ఇవ్వాలని, పని ప్రదేశంలో కార్మికులకు తాగడానికి మంచినీరు ప్రతి గ్రామ పంచాయతి నుండి విధిగా అందించాలని కోరారు. పని ప్రదేశంలో నీడ కోసం టెంట్, ప్రమాదంలో గాయపడితే చికిత్స కోసం మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని, 2025 జనవరి నుండి బందు చేసిన (నిలుపుదల చేసిన) నూతన జాబు కార్డులను దరఖాస్తు చేసుకున్న వారందరికి ఇవ్వాలి, జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 164 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను, ఖాళీగా ఉన్న ఏ.పి.ఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పని ప్రదేశంలో కూలీలను రోజుకు రెండు సార్లు ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలి డిమాండ్ చేశారు. రానున్న కాలంలో ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని కొనసాగిస్తామని నర్సింహ పాలకులను హేచరించారు.

   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇప్పటికైనా సమ్మర్ అలవెన్సులు, నాలుగు కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో చార్జీలు చట్ట ప్రకారం ఇవ్వాలని, ఆధార్ కార్డుతో లింక్, ఆన్ లైన్ పేమెంట్ చెల్లింపులు, కొలతల ఆధారంగా వేతనాలు ఇచ్చే పద్ధతిని రద్దు చేయాలని అన్నారు. కార్మికులు చేసిన పనికి వారం వారం పే స్లిప్పులు ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేసి వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వాచర్లను, సీనియర్ మేట్లను ప్రత్యేకంగా గుర్తించాలని, సంవత్సరం మొత్తం పనులు కల్పించాలని, అర్హత కలిగిన వారికని ఎఫ్.ఏ.లు గా ప్రమోషన్ సూచించారు. పని ప్రదేశంలో ప్రమాదం జరిగి కార్మికులు గాయపడితే ఏ ఆసుపత్రికలోనైనా ఉచిత వైద్యం చేయించాలని, పని చేయని రోజులలో కూడా కూలీ డబ్బులు చెల్లించాలని, పని ప్రదేశంలో ప్రమాదం జరిగి మరణిస్తే 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పని ఇవ్వకుంటే చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఎంపిక చేసిన 10,517 మందికి వెంటనే డబ్బులు ఇవ్వాలని, 20 గుంటల లోపు భూమి ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఎంపిక చేసి 12 వేల రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోషల్ ఆడిట్ కమిటీలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. కార్మికులు ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు ఉధృతంగా పోరాటాల నిర్వాహణకు సిద్ధం కావాలని యాదగిరి పిలుపునిచ్చారు.

    ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, జిల్లా సహాయ కార్యదర్శులు సిర్పంగి స్వామి, గుంటోజు శ్రీనివాస్ చారి, పల్లెర్ల అంజయ్య, కూకుట్ల చొక్కా కుమారి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలగాని జెరాములు, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడగా.  ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌల్, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య, కొండాపురం యాదగిరి, సిలివేరి ఎల్లయ్య, దొడ్డి బిక్షపతి, బోయ యాదయ్య, మెతుకు అంజయ్య, మానె సాలయ్య, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, వల్లంబట్ల శ్రీనివాసరావు, చింతకాయల నర్సింహ, గాడి శ్రీనివాస్ తో పాటు జిల్లా నాయకులు కొక్కొండ లింగయ్య, జంగయ్య, పబ్బోజు రాధమ్మ , రామలీల, యాదమ్మ, లక్ష్మమ్మ, అనురాధ, పద్మ, బుచ్చమ్మ, సరూప లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -