Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముగిసిన సరస్వతీ నది పుష్కరాలు

ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు

- Advertisement -

– కాళేశ్వరంలో చివరి రోజు మూడున్నర లక్షలమంది స్నానాలు
– సంగమంకు నవరత్న మాల హారతి
నతెలంగాణ-కాళేశ్వరం

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దేవస్థానానికి ఆనుకొని ఉన్న త్రివేణి సంగమంలోని సరస్వతీ నదిలో 12 రోజుల పాటు పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సందర్శకులు కాళేశ్వరానికి చేరుకొని సరస్వతి నదికి, సంగమం పుష్కర ఘాట్‌కు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా, చివరి రోజు సోమవారం సాయంత్రం 7.30గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో దేవస్థానం నుంచి శోభాయాత్రగా సరస్వతి నది సంగమం వరకు వెళ్లి కలశాలతో ముక్తీశ్వరు డిని అభిషేకించారు. అక్కడే నదీమ తల్లికి హారతి పట్టి చీర, సారెతో సాగనంపి తిరుగు ముఖం పట్టారు. చివరి రోజు కావడంతో రాష్ట్ర నలు మూలల నుంచి సుమారు 3.50 లక్షల మంది సందర్శకులు కాళేశ్వరానికి వచ్చి స్నానాలు ఆచరించారు. అనంతరం ముక్తీశ్వర స్వామిని దర్శించు కున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ ఖరే పర్యవేక్షణలో ఆయా శాఖల అధికారులు పకడ్బందీ వసతులు కల్పించారు. గత 11రోజులుగా గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం, స్వామి వారి దర్శనం కోసం వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం తాగునీటి సరఫరా, త్రివేణి సంగమం వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్యశాఖ మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ఓఆర్‌ఎస్‌, అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య సేవలు అందించింది. పంచాయతీరాజ్‌ విభాగం మూడు షిఫ్టుల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారా మంచినీరు, మరుగుదొడ్ల నిర్వ హణ చేపట్టారు. విద్యుత్‌ శాఖ ద్వారా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేశారు. చిన్నారులు ఆట బొమ్మల కొనుగోళ్లు, శీతల పానీయాలు, నిమ్మ రసం, లస్సీ, విజయ డెయిరీ ఉత్పత్తులు, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఏర్పాటు చేసిన తాగునీరు సేవించి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -