Monday, June 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకవిత వ్యవహారమంతా ఫ్యామిలీ డ్రామా

కవిత వ్యవహారమంతా ఫ్యామిలీ డ్రామా

- Advertisement -

– బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు లేదు
– అదొక అవినీతి, కుటుంబ పార్టీ
– చార్‌ పత్తా నటనతో గ్యారంటీల వైఫల్యం దాచలేరు: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
నవతెలంగాణ – కరీంనగర్‌

కాంగ్రెస్‌ పార్టీ ‘చార్‌ పత్తా’ సినిమాటిక్‌ డ్రామాతో ఆరు గ్యారంటీల వైఫల్యంపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని, బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తూ లేదని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్‌ క్రియేషన్స్‌ జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజలను మభ్యపెట్టేందుకు ‘చార్‌ పత్తా’ డ్రామా నడిపిస్తున్నాయని తెలిపారు. కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రగా, కాంగ్రెస్‌ నిర్మాణ, దర్శకత్వంలో ఈ నాటకం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కవిత అరెస్టు జరగకుండా బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించారని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాత్రమే కలిసి పనిచేశాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -