క్వార్టర్స్లో సాత్విక్, చిరాగ్ ఓటమి
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
జకర్తా (ఇండోనేషియా) : సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పోరాటానికి క్వార్టర్ఫైనల్లోనే తెరపడింది. ఓ వైపు ఫిట్నెస్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. కఠిన ప్రత్యర్థులపై మెరుపు విజయాలు సాధిస్తున్న సాత్విక్, చిరాగ్లు ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. పురుషుల డబుల్స్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.7, మలేషియా జోడీ వీ చోంగ్, వున్ టీలు 21-19, 21-16తో భారత స్టార్స్పై విజయం సాధించారు. 43 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్లో సాత్విక్, చిరాగ్లు ఆశించిన పోరాటం చేయలేదు. తొలి గేమ్లో 11-10తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన సాత్విక్, చిరాగ్లు ద్వితీయార్థంలో పట్టు కోల్పోయారు. 17-17, 19-19తో స్కోరు సమం చేసి మలేషియా షట్లర్లపై ఒత్తిడి పెంచినా.. 19-21తో ఓటమి తప్పలేదు. రెండో గేమ్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేని సాత్విక్, చిరాగ్లు చేతులెత్తేశారు. మలేషియా షట్లర్లతో గత నాలుగు మ్యాచుల్లో తిరుగులేని విజయాలు సాధించిన సాత్విక్, చిరాగ్లు తొలిసారి ఆ జోడీ చేతిలో పరాజయం చవిచూశారు. మెన్స్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో సాత్విక్, చిరాగ్ ఓటమితో ఇండోనేషియా ఓపెన్లో భారత పోరాటం ముగిసింది.
పోరాటం ముగిసె!
- Advertisement -
- Advertisement -