Monday, June 23, 2025
E-PAPER
Homeఖమ్మంఅసెంబ్లీలో మొదటి గా మాట్లాడిన అంశం…

అసెంబ్లీలో మొదటి గా మాట్లాడిన అంశం…

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట నుండి మారుమూల అటవీ ప్రాంతం అయిన కావడిగుండ్ల కు బస్ సౌకర్యం కల్పించాలని అసెంబ్లీలో మొదటిగా ప్రస్తావించిన అంశం నేటికి నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హర్షం వ్యక్తం చేసారు. సత్తుపల్లి డిపో పరిధి లోని  అశ్వారావుపేట నుండి కావడి గుండ్ల కు సోమవారం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తో కలిసి నూతన బస్సు సర్వీస్ ను ఆయన లాంచనంగా జెండా ఊపి ప్రారంభించారు.

అశ్వారావుపేట నుండి కావడిగుండ్ల వరకు ఆర్టీసి సిబ్బందితో కలిసి ఆయన బస్సు ప్రయాణం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ సమావేశాలలో కావడి గుండ్ల గ్రామానికి బస్సు సౌకర్యం లేదు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అని, ప్రజా ప్రభుత్వం లో నూతన బస్సును ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరంగా ఉంది అని అన్నారు.డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సత్తుపల్లి డిపో నుండి కావడి గుండ్ల,ములకలపల్లి ఒక్కో బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.ప్రయాణీకులు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.  ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ ఆనందం, ఏడీ సీలు కే.వీ.రావు,అప్పారావు, కంట్రోలర్ ఎన్వీఎస్ రావు,వీబీఓ కిన్నెర ఆనందరావు పాల్గొన్నారు.

బస్ సర్వీస్ వేళలు :

ఉదయం 6.30 కు సత్తుపల్లి బస్ డిపోలో బయలు దేరి గంగారం,మందలపల్లి మీదుగా అశ్వారావుపేట బస్ స్టాండ్ కు ఉదయం 7.30 కు చేరుకుంటుంది.
ఉదయం 7.45 కు అశ్వారావుపేట బస్ స్టాండ్ లో బయలు దేరి తిరిగి ఇదే రూట్ లో సత్తుపల్లి 8.45 కు చేరుకుంటుంది.
ఉదయం 9.15 కు సత్తుపల్లి నుండి ఉదయం 10.15 కు అశ్వారావుపేట చేరుకుంటుంది.
ఉదయం 10.30 కు అశ్వారావుపేట లో బయలు దేరి ఊట్లపల్లి,వాగొడ్డుగూడెం,లంకాలపల్లి,రామన్నగూడెం,రాచన్నగూడెం,పూచిక పాడు,కన్నాయిగూడెం,గోపన్న గూడెం,కావడిగుండ్ల,కొత్త కావడిగుండ్ల కు ఉదయం 11.30 కు చేరుకుంటుంది.
మధ్యాహ్నం 12 గంటలకు కావడి గుండ్ల నుండి తిరుగు ప్రయాణంలో అదే రూట్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు అశ్వారావుపేట చేరుకుంటుంది.
మధ్యాహ్నం 1.15 గంటలకు అశ్వారావుపేట నుండి 2.15 గంటలకు సత్తుపల్లి కి చేరుతుంది.
సత్తుపల్లి లో 2.30 కు బయలుదేరి అశ్వారావుపేట కు 3.30 గంటలకు చేరుకుంటుంది.
సాయంత్రం 3.45 గంటలకు అశ్వారావుపేట లో బయలు దేరి 4.45 గంటలకు కావడి గుండ్ల కు చేరుతుంది.
సాయంత్రం 5 గంటలకు కావడి గుండ్ల లో బయలుదేరి 6 గంటలకు అశ్వారావుపేట చేరుకుంటుంది.
సాయంత్రం 6.15 గంటలకు అశ్వారావుపేట లో బయలు దేరి 7.15 సత్తుపల్లి చేరుకుంటుంది.
సత్తుపల్లి లో రాత్రి 8 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు అశ్వారావుపేట చేరుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -