- Advertisement -
తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, నైగావ్ గ్రామంలో జన్మించారు.ఆమె తన భర్త జ్యోతీరావ్ పూలేతో కలిసి కుల వివక్షకు వ్యతిరేకంగా,మహిళా విద్య కోసం అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజుగౌడ్,వార్డు సభ్యుడు తిర్రి అశోక్,జీపీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



