- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : రేపు మండల కేంద్రంలో జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు జుక్కల్ మండల కేంద్రంలోని మాత్మ బసవేశ్వర చౌక్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ మండలాల, గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్, అసైన్డ్ పోడు రైతులు, ప్రతి ఒక్కరూ తమ హక్కుల సాధనకోసం ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు.
- Advertisement -