మరో రూ.2,840 పెంపు
24 క్యారెట్లు 10 గ్రాములు రూ.1,57,300కు
10 గ్రాముల వెండి ధర రూ.3400
న్యూఢిల్లీ : బంగారం ధర మెరుపులు కొనసాగుతూనే ఉన్నాయి. పసిడి, వెండి ధరలు వారాంతం సెషన్లో మరో కొత్త రికార్డ్ను సృష్టించాయి. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,840 ఎగిసి రూ.1,57,300కు చేరింది. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పసిడి రూ.2,600 ప్రియమై రూ.1,44,200గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.15,000 పెరిగి రూ.3.40 లక్షలకు చేరింది. దీంతో 10 గ్రాముల వెండి ధర రూ.3400గా నమోదయ్యింది. ట్రంప్ టారిఫ్ ఉన్మాదానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోల్చినప్పుడు రూపాయి రికార్డ్ పతనం పసిడి ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి.
బంగారం మెరుపులే..
- Advertisement -
- Advertisement -



