Tuesday, July 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యం

చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యం

- Advertisement -

నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్..
నవతెలంగాణ – జన్నారం
: రైతుల పంటలకు చివరి ఆయకట్టు వరకు కడెం ప్రాజెక్టు నుంచి నీటిని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ డివిజన్  కార్యాలయ ఆవరణంలో రూ.35.5 లక్షల వ్యయంతో నూతన సబ్ డివిజన్ కార్యాలయ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడెం  ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా రెండు పంటలకు నీరు ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు.

ఈ ప్రాంత రైతాంగానికి ఖరీఫ్ కు రబీ పంటలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. కడెం ప్రాజెక్టు నుంచి వచ్చే ప్రధాన కాలువలను సక్రమంగా పంటలకు నీరు అందిస్తామన్నారు. చెడిపోయిన కాలువలను మరమ్మత్తుల కోసం ప్రత్యేక నీతులు కెరటాయించడానికి  ముఖ్యమంత్రి మంత్రులను కలిసి  ప్రత్యేక నిధులు తీసుకొస్తామన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో చెరువులు నిండుగా ఉంటేనే చెరువు ఆయకట్టు కింది రైతుల పంట పొలాలు సక్రమంగా పండుతాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి, రైతుబంధు ఇస్తూ  అండగా నిలుస్తుంది అన్నారు ప్రభుత్వానికి రైతులు బాసటగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ , వైస్ చైర్మన్ ఫసి యు లా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ముజాఫర్ అలీ ఖాన్ మేకల మాణిక్యం,  ప్రాజెక్టు ఈఈ విటల్,డిప్యూటీఈఈ వెంకటేశం, ఎఈఈలు శ్రవణ్ కుమార్,కె.శ్రావణ్ కుమార్, స్థానిక తహసిల్దార్ రాజమోహన్ రెడ్డి,ఎంపీడీవో హుమర్ షరీఫ్, నీటిపారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ మామిడి శంకర్, పార్టీ నాయకులు మోహన్ రెడ్డి మిక్కిలినేని రాజశేఖర్ మహమ్మద్ రియాజుద్దీన్, ముత్యం రాజన్న, నందు నాయక్ దుర్గం గంగాధర్,  లకావత్ తిరుపతి మౌలానా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీష్, ఇందయ్యా  రమేష్, అజారుద్దీన్, నరసింగరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -