- Advertisement -
- – టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
- – తండాలను గ్రామాలకు ధీటుగా అభివృద్ధి చేస్తాం
- – స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
- నవతెలంగాణ పెద్దవంగర: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని మోత్య తండా, శంకర్ తండా, బొత్తల తండా, బీసీ తండా, వంపు తండాల్లో విస్తృతంగా ఆమె పర్యటించారు. తండా వాసులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గంలోని తండాలను గ్రామాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
- పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సమర్ధవంతంగా పని చేస్తుందని కితాబిచ్చారు. రాష్ట్రంలోనే పాలకుర్తి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, నాయకులు ప్రజల్లో ఉండాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
- కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, జాటోత్ నెహ్రు నాయక్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మండల నాయకులు తోటకూరి శ్రీనివాస్, బానోత్ సీతారాం నాయక్, బొమ్మెరబోయిన రాజు, దాసరి శ్రీనివాస్, ఎండీ జాను, యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ, బానోత్ సోమన్న, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకుల సమ్మయ్య, ఉపేందర్, రవి, వెంకన్న, శ్రీనివాస్, దస్రు నాయక్ రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -