– ఫిక్సిడ్ వేతనం రూ.18 వేలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
– రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
– ఆశా కార్యకర్తలు యూనియన్ జిల్లా కార్యదర్శి బి. ప్రవీణ.
నవతెలంగాణ – తొగుట
ప్రభుత్వం ఆషాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆషా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి.ప్రవీణ డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో పీహెచ్సీ ముందు ధర్నా చేశారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారి తోషికాలు రాకపోవడంతో ఆశా వర్కర్లము అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఫిక్సిడ్ వేతనం రూ.18 వేలు, ఇతర సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆశా లకు ఇచ్చిన హామీలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేని ఫెస్టోలో వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తామనీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని, ప్రమోషన్స్ కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు పోస్టుల్లో డైరెక్ట్ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ఏఎన్సీ, పిఎన్సీ తదితర టార్గెట్లను వెంటనే రద్దూ చేయాలనీ, గత 3 సంవ త్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలనీ డిమాండ్ చేశారు. ఆశాలకు పారి తోషికం లేని పనులు చేయించకూడదనీ తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేని యెడల రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు డీ. లక్ష్మి, క్రిష్ణ వేణి, సౌందర్య, రూప, జ్యోతి, స్వరూప, నవీన, కే. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES