Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

- Advertisement -
  • టియు జెఎసి సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్

నవతెలంగాణ- గజ్వేల్ 

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ సమీకృత కార్యాలయ భవనంలో టియూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు వేముల యాదగిరి, ప్రధాన కార్యదర్శి డోలక్ యాదగిరిలతో కలిసి గజ్వేల్ ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం పోరాటాల త్యాగాల చరిత్ర అని, 1969 తొలిదశ ఉద్యమంలో 369 మంది, మలిదశ ఉద్యమంలో 1200 మంది రాష్ట్ర సాధనలో అమరులయ్యారన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో ఉద్యమకారుల బతుకులు చిత్రమైపోయాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీలు ఇచ్చిందన్నారు. ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఉద్యమకారులకు 250 గజాలలో ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నెలకు 30 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది ఉద్యమకారులలో సగం మందికే గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల ఆర్థిక సాయం చేసిందని, మిగతా ఉద్యమకారులకు ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. 100 ఎకరాలలో అమరవీరుల స్మృతిమనం ఏర్పాటు చేయాలన్నారు. అమరుల కుటుంబాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యమకారులకు ఉచిత బస్సు పాసులు అందజేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు 50 శాతం సబ్సిడీతో కూడిన కోటి రూపాయల వ్యాపార నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలన్నారు.రాష్ట్ర సాధనలో కీలకపాత్ర వహించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించి సాంస్కృతిక పాలసీని ప్రకటించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో అమరవీరులకు గుర్తుగా స్మారక భవనం నిర్మించాలన్నారు. ఉద్యమకారులకు 20 లక్షల సామాన్య ప్రమాద బీమా సహకారం కల్పించాలన్నారు.ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర కోశాధికారి గంగి రాజు, చంద్రకళ, నరసన్న, బాలరాజ్, కనుక ప్రసాద్ దోమ రాజు, పుట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad