Saturday, June 7, 2025
E-PAPER
Homeసినిమామనసుల్ని కదిలించే 'నాన్నా..' పాట

మనసుల్ని కదిలించే ‘నాన్నా..’ పాట

- Advertisement -

‘కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్‌, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్‌’ తదితర చిత్రాలకు గద్దర్‌ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో నటించిన సాయి కుమార్‌ ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ‘చౌకీదార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పథ్వీ అంబర్‌, ధన్యా రమ్యకుమార్‌ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని వీఎస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద డా.కల్లహల్లి చంద్ర శేఖర్‌ నిర్మిస్తుండగా, చంద్రశేఖర్‌ బండియప్ప తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా ఓ చక్కటి బాణీని అందించారు. ‘నాన్నా…’ అంటూ సాగే ఈ పాటను సంతోష్‌ వెంకీ రచించగా.. విజరు ప్రకాష్‌ ఆలపించారు. సచిన్‌ బస్రూర్‌ అందించిన బాణీ అయితే ప్రతీ ఒక్కరి మనసుని కదిలించేలా ఉంది.
తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. ఈ సినిమాతో మరోసారి సాయి కుమార్‌ తండ్రిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. పథ్వీ అంబర్‌, సాయి కుమార్‌ మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ అందర్నీ అలరిస్తాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని మేకర్స్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -