వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
నవతెలంగాణ – తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్గడ్ మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రయివేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్న బాబు స్థాన ఘట్టాల వద్ద బ్యాటరీ వద్ద పుణ్య స్థానాల ఆచరించి, కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సరే ఒడి బియ్యం ఎత్తు బంగారం సమర్పించి ప్రత్యేకముక్కులు చెల్లించారు. పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు దగ్గర ఉండి వనదేవతలకు సులభంగా దర్శనమయ్యే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులు మొక్కులు అనంతరం దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లి వంటావార్పు చేసుకుని విందు భోజనాలు ఆరగించారు. అనంతరం ఎవరి ఇళ్లల్లోకి వారు సురక్షితంగా వెళ్ళిపోయారు.
మేడారంలో భక్తుల సందడి ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES