– మీనాక్షి నటరాజన్కు కాటం శ్రీధర్ బృందం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబారద్
ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుదలను ఉపసంహరించుకోవాలని వ్యవసాయ, హార్టికల్చర్, వెటర్నిరీ పీజీ, రీసెర్చ్ స్కాలర్స్-జేఏసీ కోరింది. ఈమేరకు గురువారం జేఏసీ నేతలు కాటం శ్రీధర్, రాజ్కుమార్, మధుకర్, అరుణ, రాకేష్, శేఖర్తో కూడిన బృందం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు వినతిపత్రం అందజేసింది. ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 3 ప్రకారం యూజీసీ స్కేలులో ఉన్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏండ్లకు పెంచే విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీఎన్ఆర్టీవీయూ, ఎస్కేఎల్టీహెచ్యూ వంటి సాంకేతిక విశ్వవిద్యాలయాలకు వర్తింపజేయరాదని వారు కోరారు. ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత లేదని వారు గుర్తు చేశారు.
ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుదలను ఉపసంహరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES