- Advertisement -
ప్రధాని సనాయె తకాయిచి కీలక నిర్ణయం
60 ఏండ్లలో ఇదే తొలిసారి
టోక్యో : జపాన్ పార్లమెంటును ఆ దేశ ప్రధాని తకాయిచి రద్దు చేశారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలలకే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రతినిధుల సభను రద్దు చేసి, ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారని స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. తన ఆర్థిక భద్రతా విధాన ఎజెండాకు ప్రజల మద్దతు కోరుతూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 465 మంది సభ్యులున్న దిగువ సభను రద్దు చేసి, ఈ నిర్ణయం తీసుకోవడం 60 ఏండ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
- Advertisement -



