జ్యోతి రెడ్డి మహిళా ఉద్యమకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు
దేవాలయంలో హోమం కార్యక్రమం
నవతెలంగాణ – గోవిందరావుపేట : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మహిళా ఉద్యమకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యమకారుల సంఘం ములుగు జిల్లా గౌరవ అధ్యక్షురాలు యాస పూలమ్మ ఆధ్వర్యంలో హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా ఉద్యమకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు దేవి లు హాజరై మాట్లాడారు. మరి దశ ఉద్యమంలో సకలజనుల సమ్మె మొదలుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో మహిళా ఉద్యమకారులు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారని దాని ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు క్రమంలో అనేక ఆటుపోటులకు గురి అయ్యామని ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోవడం జరిగిందని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులను గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లు సమస్యలు గుర్తుకు రావాలని ఉద్దేశంతో శాంతియుతంగా ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బత్తుల రాణి, మహిళ ఉద్యమకారుల సంఘం మండల ఉపాధ్యక్షురాలు యానాల ఉపేంద్ర , కార్యదర్శి సమ్మక్క కోశాధికారి సరోజన తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES