- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మహారాష్ట్రలోని దేగ్లూర్ పట్టణానికి చెందిన సచిన్ (29) బిఎస్ఎఫ్ జవాన్ ఇటీవల జమ్ము కాశ్మీర్ యుద్ధ ట్యాంకర్ ప్రమాదంలో వీర మరణం పొందారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం పట్టణంలో సికింద్రాబాద్ బిఎస్ఎఫ్ మిలిటరీ అధికారుల ఆధ్వర్యంలో అధికార లాంచనాలతో ఘనంగా నిర్వహించారు. అంత్యక్రియలకు మహారాష్ట్రతో పాటు సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణకు చెందిన జనాలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆరనకు ప్రతి ఒక్కరూ నివాళులర్పిస్తూ.. భారత్ మాతాకీ జై.. సచిన్ అమర్ హై అనే నినాదాలతో వేలాది జనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.
- Advertisement -