సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ – నూతనకల్ : బత్తుల యశోద జీవితం స్ఫూర్తిదాయకంమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎల్కపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బత్తుల యశోద సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అనేక పోరాటాలకు త్యాగాలకు నిలయమైన ఎల్కపల్లి గ్రామంలో సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన ఆమె తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసంపని చేసినగొప్ప నాయకురాలు అని అన్నారు. చదువు, సంధ్య లేకున్నా పార్టీ నిర్ణయాలను, విధానాలనుతూచా తప్పకుండా అమలు చేశారని అన్నారు. ఎన్ని నిర్బంధాలు, ఆటంకాలు వచ్చిన నికార్సైన కమ్యూనిస్టుగా జీవించారని అన్నారు. గ్రామంలో శత్రువుల దాడులను ఎదుర్కొని గ్రామంలో ఎర్ర జెండాను నిలబెట్టడంలో బత్తుల, తోనకనూరి, దూదిగాం కుటుంబలు ప్రముఖ పాత్ర పోషించారనిగుర్తు చేశారు. పార్టీలో చీలికలు వచ్చినప్పుడు సైతం సీపీఐ(ఎం) వైపు నిలిచి పార్టీని కంటికి రెప్పలా కాపాడినత్యాగశీలి అని అన్నారు. ఆమె గ్రామ వార్డు నెంబర్ గా పనిచేసి గ్రామ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘంలో, మహిళా సంఘంలో పనిచేసి వార్డు మెంబర్ గా గెలిసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిందన్నారు. వారి పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా ఆశయాలను ఇచ్చారని అన్నారు. వారి పెద్ద కుమారుడు బత్తుల జనార్ధన్ పార్టీ నాయకుడిగా పనిచేస్తూ గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీని నిలబెట్టడంలో ఆయన కృషి మరువలేనిది అన్నారు.
నీతి, నిజాయితీగా పనిచేస్తూ గ్రామంలో వచ్చిన ప్రజా సమస్యలను నిక్కచ్చిగా మాట్లాడి, వాటిని సామరస్యంగా పరిష్కరించడంలో ఆమె భర్త కృషి మరువలేనిదని అన్నారు. ఎన్నో ప్రలోభాలకు గురై పార్టీలు మారుతున్న ఈ రోజుల్లోతాను నమ్మిన సిద్ధాంతానికి నిలబడి కడదాకా కమ్యూనిస్టు యోధుడుగా నిలబడి ఆ గ్రామ ప్రజల మనసులను చురగున్న మంచి వ్యక్తిత్వం కలిగిన గొప్ప నాయకురాలు అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎర్ర జెండా వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సంతాప సభలో కళాకారులు పాడిన విప్లవ గేయాలు ప్రజలను విశేషంగా కట్టుకున్నాయి. సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి చూడి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగినఈ సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి,బుర్ర శ్రీనివాస్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అబ్బ గాని బిక్షం, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డీ అంజిబాబు, సీపీఐ(ఎం) పార్టీ మద్దిరాల మండల కార్యదర్శి పోలోజు సైదులు, గ్రామ మాజీ ఉపసర్పంచ్ లు తో ణుకునూరి ఉప్పలయ్య, దూదిగాం ఎల్లయ్య, మహిళా సంఘం నాయకురాలు దూదిగాo మంగమ్మ, సీపీఐ(ఎం)పార్టీ మండల కమిటీ సభ్యులు తొట్ల లింగయ్య, బొజ్జ శ్రీనివాస్, గజ్జల శ్రీనివాస్ రెడ్డి, బత్తుల యశోద కుటుంబ సభ్యులు బత్తుల జనార్ధన్, బత్తుల సాయిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.