Monday, June 2, 2025
E-PAPER
Homeజాతీయంభారత యుద్ధ విమానాలకునష్టం వాస్తవమే

భారత యుద్ధ విమానాలకునష్టం వాస్తవమే

- Advertisement -

– బ్లూమ్‌బర్గ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:
ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత భారత్‌, పాక్‌ మధ్య జరిగిన సైనిక ఘర్షణల్లో యుద్ధ విమానాలకు నష్టం జరగడం వాస్తవమేనని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. అయితే ఎన్ని యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లింది, ఎంత మేరకు నష్టం జరిగింది అనేది ఆయన చెప్పలేదు. కానీ భారత్‌కు చెందిన ఆరు ఫైటర్‌ జెట్లను కూల్చివేసినట్టు పాక్‌ చేస్తున్న వాదనను మాత్రం ఆయన తోసిపుచ్చారు. అది ‘పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేశారు. భారత్‌ కోల్పోయిన యుద్ధ విమానాలపై సీడీఎస్‌ స్పందించడం ఇదే తొలిసారి కావావడం గమనార్హం.బ్లూమ్‌బర్గ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీడీఎస్‌ మాట్లాడుతూ.. ‘విమానాలను కోల్పోవడం కంటే దానికి గల కారణాలు కనుగొనడం ముఖ్యం. అప్పుడే భారత సైన్యం తన వ్యూహాలను మరింత మెరుగుపరుచుకొని, తిరిగి దాడి చేయగలగుతుంది’ అని జనరల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.ఈ నెల ఆరంభంలో పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణల్లో భారత్‌ తన యుద్ధ విమానాలను కోల్పోయిందా అని చౌహాన్‌ను అడగగా, ఆయన ఈ విధంగా తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.”కీలక విషయం ఏమిటంటే, మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే అర్థం చేసుకున్నాం. వాటిని సరిదిద్దుకున్నాం. రెండు రోజుల తర్వాత మేము మళ్లీ దాడులు చేశాం. పాక్‌లోని సుదీర్ఘ లక్ష్యాలపై మా ఫైటర్‌ జెట్లతో దాడి చేయగలిగాం” అనిసీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ అన్నారు.
అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం లేదు
అణు యుద్ధాన్ని ఆపానన్న డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి జనరల్‌ చౌహాన్‌ నిరాకరించారు. అయితే నాలుగు రోజుల భారత్‌-పాక్‌ ఘర్షణ అణుయుద్ధానికి ఏమాత్రం చేరువకాలేదని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. భారత్‌ దాడులను అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాక్‌ వాదనను ఆయన తోసిపుచ్చారు. చైనాకు సంబంధించిన రక్షణ వ్యవస్థలు సరిగ్గా పని చేయలేదని త్రిదళాధిపతి స్పష్టం చేశారు. భారీగా రక్షణ వ్యవస్థలు మోహరించిన పాక్‌ వాయుసేన స్థావరాలపైనే, మీటర్‌ కూడా తేడా లేకుండా అత్యంత కచ్చితమైన దాడులు చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ షాంగ్రి-లా డైలాగ్‌లో పాల్గొనడం కోసం సింగపూర్‌లో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -